శ్రీశైలం దసరా నవరాత్రి ఉత్సవాలకు సీఎం జగన్ కి ఆహ్వానం

-

దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దసరా నవరాత్రుల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం సీఎం జగన్ ను మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, దేవాలయ శాఖ కమిషనర్ ఎం హరి జవహర్లాల్, శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న సభ్యులు కలిశారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేద పండితుల వేద ఆశీర్వచనం తో పాటు శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీఎం జగన్ ను శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దసరా నవరాత్రి ఉత్సవాలకు హాజరు కావలసిందిగా దేవాదయ శాఖ మంత్రి, దేవాదయ శాఖ కమిషనర్, శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వాహన అధికారి కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news