IPL 2022: రెండు బడా రికార్డులకు చేరువలో రోహిత్ శర్మ..నేటి మ్యాచ్ లో..

-

ఐపీఎల్ 2022 లో నేడు మరో ఆసక్తికర పోరు జరిగినుంది.నేటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.పూణే వేదికగా రాత్రిపూణే వేదికగా రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.ఈ సీజన్ లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని మాజీ ఛాంపియన్ ముంబైండియన్స్ ఈ మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది.ఇక ఇప్పటి వరకూ రెండు విజయాలు సాధించిన పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలిచి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది.అయితే ఈ మ్యాచలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండు రికార్డులను అందుకునే అవకాశం ఉంది.

అవి ఐపీఎల్ లో ఇప్పటి వరకు 499 పోర్లు కొట్టిన రోహిత్ శర్మ మరొక ఫోర్ కొడితే ఈ లీగ్ లో 500 ఫోర్లు పూర్తిచేసుకుంటాడు.దీంతో ఐపీఎల్ లో ఈ రికార్డు సృష్టించిన ఆటగాడిగా నిలుస్తాడు.అయితే హిట్ మ్యాన్ నేడు పంజాబ్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ ఆడబోయే మ్యాచ్ లో 25 చేస్తే టి 20 క్రికెట్ లోఇప్పటి వరకు 9,975 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఇంకో 25 పరుగులతో 10,000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.తద్వారా t20 క్రికెట్ లో 10,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డు సాధిస్తాడు.

Read more RELATED
Recommended to you

Latest news