IPL ఫాన్స్ కు గుడ్ న్యూస్..ఇక నుంచి టోర్నీ కోసం ఐసీసీ ప్రత్యేక షెడ్యూల్​ !

-

ఐపీఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ ఆదరణ లభించింది. అయితే తాజాగా ఐపీఎల్ ఫ్యాన్స్ కు ఐసీసీ శుభ వార్త చెప్పింది. వేట ఐపీఎల్ లో వివిధ దేశాల ఆటగాళ్లు పాల్గొంటున్నా… ముందుగా ఉన్న షెడ్యూల్ కారణంగా కొంతమంది ఐపీఎల్ టోర్నీ మిస్ అవుతున్నారు.

దీంతో తమ అభిమాన ప్లేయర్ జట్టులో లేడని ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశ చెందుతున్నారు. ఇప్పుడు ఆ లోటు ను bcci భర్తీ చేసింది. ఇకపై కేవలం ఐపీఎల్ కోసం అన్ని క్రికెట్ బోర్డులు ప్రత్యేక షెడ్యూల్ ను కేటాయించేలా తీర్మానించింది. దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలపడంతో లైన్ క్లియర్ అయింది. ఐసీసీ తయారుచేసే తదుపరి క్యాలెండర్లో ఐపీఎల్ కోసం రెండున్నర నెలలు కేటాయించనున్నట్లు బిసిసిఐ కార్యదర్శి ప్రకటించారు. అంతేకాదు భవిష్యత్తులో ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్య 94 కు పెంచనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news