IPL 2022 : ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం నుంచి కోలుకున్న ఇషాన్ కిషాన్

-

ముంబై ఇండియ‌న్స్ అభిమానుల‌కు యాజ‌మాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై ఇండియన్స్ ఆడిన తొలి మ్యాచ్ లో ఓపెన‌ర్ ఇషాన్ కిషాన్ తీవ్రంగా గాయ‌ప‌డ్డ విషయం తెలిసిందే. కాగ ఇషాన్ కిషాన్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న గాయానికి చికిత్స అందుకున్నాడు. అయితే తాజా గా ఇషాన్ కిషాన్ తన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని ముంబై క్రికెట్ ఆప‌రేషన్స్ డైరెక్ట‌ర్ జ‌హీర్ ఖాన్ తెలిపాడు. ఇషాన్ కిషాన్ గాయం నుంచి కోలుకోవ‌డంతో పాటు పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాడ‌ని వెల్ల‌డించాడు.

ఏప్రిల్ 2 వ తేదిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌ర‌గ‌బోయే మ్యాచ్ కు ఇషాన్ కిషాన్ అందుబాటులో ఉంటాడ‌ని ప్ర‌క‌టించాడు. అయితే ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో జ‌రిగిన మొద‌టి మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ కేవ‌లం 48 బంతుల్లోనే 81 ప‌రుగులు చూసి ఆక‌ట్టుకున్నాడు. అయితే ఇషాన్ కిషాన్ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో 18వ ఓవ‌ర్ లో షార్ధూల్ ఠాకూర్ వేసిన యార్క‌ర్ ను ఎదుర్కొన్నాడు.

దీంతో ఇషాన్ కిషాన్ ఎడ‌మ కాలికి తీవ్ర గాయం అయింది. గాయం అయినా.. బ్యాటింగ్ చేయ‌డంతో కాస్త తీవ్రం అయింది. దీంతో ఫిల్డింగ్ స‌మ‌యంలోనూ ఇషాన్ కిషాన్.. క‌నిపించ‌లేదు. అయితే గాయం కార‌ణంగా త‌ర్వాతి మ్యాచ్ లకు ఇషాన్ కిషాన్ అందుబాటులో ఉంటాడో లేదో అనే అనుమానులు ఉండేవి. తాజా గా జ‌హీర్ ఖాన్ ప్ర‌క‌ట‌న తో క్లారిటీ వ‌చ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news