చపాతి అడిగితే ఇవ్వలేదని దారుణ హత్య

-

అసలు మనిషి ప్రాణాలకు విలువ ఉందా అంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఉంది అని చెప్పలేము. ఎందుకంటే మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు ఇక ఇప్పుడు అదే మానవత్వాన్ని కోల్పోతున్నారు. చిన్న చిన్న విషయాలకే ఉన్మాదులుగా మారిపోతున్నారు. సాటి మనుషుల విషయంలో కాస్త అయినా జాలీ, దయా చూపించడం లేదు. అంతేకాదు ఏకంగా సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు.

చిన్న చిన్న విషయానికి దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఎంతోమంది. మద్యం మత్తులో క్షణికావేశంలో ప్రాణాలు తీస్తూ చివరికి జైలు ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. మున్నా (40) అనే వ్యక్తిని ఓ మందు బాబు కత్తితో పొడిచి చంపాడు. రిక్షాలో ఇద్దరు వ్యక్తులు భోజనం చేస్తుండగా ఓ మందుబాబు అక్కడికి వచ్చి భోజనం పెట్టాలని వారిని అడిగాడు.

దీంతో మున్నా అతనికి ఒక రోటి ఇచ్చాడు. మరో రోటి ఇవ్వాలని అడిగితే అతడు లేవని సమాధానం ఇచ్చాడు. దీంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన ఆ మందు బాబు కత్తితో మున్నా నీ పొడిచాడు. దీంతో మున్నా ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు ఫిరోజ్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news