దళిత బంధు పథకం పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

-

దళిత బంధు పథకం పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ కేవలం ఎన్నికల కోసమే వాడుకుంటున్నారని అన్నారు ఈటెల రాజేందర్. దళిత బందును పూర్తి స్థాయిలో అమలు చేయడానికి రెండు లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయి అన్నారు ఈటెల. ఏడాదికి 10 వేల కోట్ల నిధులు ఖర్చు చేసిన దళిత బందు పూర్తిస్థాయిలో అమలు చేయడానికి 20 ఏళ్లు పడుతుందని వివరించారు.

 

నేను ఒక ఆర్థిక మంత్రిగా పని చేశాను కాబట్టే చెబుతున్నానని.. కెసిఆర్ లెక్కలకు, మాటలకు పొంతన ఉండదు అని ఎద్దేవా చేశారు ఈటెల రాజేందర్. తెలంగాణలో రాష్ట్ర ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదన్నారు ఈటెల.దళిత బంధు పథకం అందరికీ అందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news