కేసీఆర్ ను ఈడీలు ఏమి చేయలేవు..బండి సంజయ్ కి జగదీష్ రెడ్డి కౌంటర్

-

నల్లగొండలో మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలను చూస్తుంటే ఈన్నాళ్ళుగా ఈడిని దుర్వినియోగం చేస్తారనే విషయం అర్థమవుతుందని.. ఈడీని అడ్డం పెట్టుకొని బిజెపి రాజకీయాలు చేస్తుంది అనడానికి ఈవ్యాఖ్యలు నిదర్శనమని చురకలు అంటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈడీలు ఏమి చేయలేవని తేల్చి చెప్పారు.

బిజెపికి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలతో కలిసి నడుస్తామని.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అది అవసరం కూడా అన్నారు. మునుగోడల వామపక్షాల ఓట్లు కీలకం అని వెల్లడించారు.

వామ పక్షాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. బిజెపి వ్యతిరేక పార్టీలు వామపక్షాలు, కూడా కలిసి రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు జగదీష్ రెడ్డి. మునుగోడు లో బిజెపికి మూడవ స్థానమేనని కుండ బద్దలు కొట్టి చెప్పారు. డబ్బు ఉన్న అహంకారం తో రాజ గోపాల్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని… ఓటర్లకు డబ్బులు పంచే సంస్కృతిని అలవాటు చేసింది ఈ నాయకులు అన్న విషయం అందరికీ తెలుసు అన్నారు జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news