బాబు అవసరం బీజేపీకి ఉందని జగన్ తెలుసుకోవాలా…?

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ని ఎదుర్కొనే విషయంలో అధికార పార్టీ నేతలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంది. కాబట్టి కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కాస్త అవసరం ఉండే అవకాశం ఉంది అని కొంతమంది అంటున్నారు.

రాజకీయ వర్గాలలో ఈ ప్రచారం నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను జగన్ సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. బీజేపీ కూడా సీరియస్ గా తీసుకుని వెళ్లే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అంత సులువు కాదు అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. చంద్రబాబు నాయుడు ద్వారా కొన్ని పార్టీలు దగ్గర చేసుకునే ఆలోచనలో కూడా బీజేపీ నేతలు ఉండే అవకాశం ఉండవచ్చు అని తెలుస్తుంది.

ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడుతో చాలా సున్నితంగా ఉంటాయి. కొన్ని కొన్ని అంశాల్లో చంద్రబాబునాయుడు వలన కొన్ని పార్టీల అధినేతలు గతంలో ఎక్కువ లబ్ధి పొందిన పరిస్థితి కూడా ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చంద్రబాబు విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లవచ్చు. అందుకే ముఖ్యమంత్రి జగన్ ని కూడా కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news