ఏపీలోని అర్చకులకు జగన్ ప్రభుత్వం శుభవార్త

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని అర్చకులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దేవాదాయ శాఖకు చెందిన ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు పదవి విరమణ ఉండబోదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రాథమిక ప్రకటన జారీ చేశారు. అధికారులు ఎవరైనా అర్చకుడు వారు స్వచ్ఛందంగా కానీ, అనారోగ్య కారణాలవల్ల ఎప్పుడైనా సరే పదవి విరమణ చేయవచ్చని తెలిపింది.

cm jagan
cm jagan

ఈ నిర్ణయానికి సంబంధించి ఏపీ ధర్మాదాయ, ధార్మిక సంస్థలు, దేవాదాయ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారి సర్వీసు నిబంధనలు-2000 లో సవరణ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ ప్రకటన నుంచి 30 రోజులు, లేదంటే తర్వాత దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొనుందని దేవాదాయ ఇంచార్జ్ ముఖ్య కార్యదర్శి డాక్టర్ హరిజవహర్ లాల్ ఉత్తర్వుల్లో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news