జగన్ కి ఓటమి భయం పట్టుకుంది – చంద్రబాబు

-

తన సభలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి జగన్ కి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. అందుకే చీకటి జీవోలతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం పై ప్రజలు విసిగిపోయారని.. అందుకే తన రోడ్ షోలకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారని చెప్పారు. ఈ నెల రెండవ తేదీన జీవో ఇచ్చి ఒకటవ తేదీ నుండి ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.

chandrababu naidu ys jagan

ప్రభుత్వం ఇచ్చిన జీవోకు చట్టబద్ధత లేదన్నారు చంద్రబాబు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనని నియోజకవర్గానికి వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే ప్రతిపక్షం ఎక్కడ రోడ్ షోలు నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది అన్నారు. ముఖ్యమంత్రి దయాదాక్షిన్యాలతో మీటింగ్ పెట్టాలనే పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మీటింగులకు ఈ షరతులు వర్తించవా? అని ప్రశ్నించారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news