ఆశా వర్కర్లకు జగన్ సర్కార్ శుభవార్త..గౌరవ వేతనం పెంపుపై ప్రకటన

-

అమరావతి : ఆశా వర్కర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది..గౌరవ వేతనం పెంపుపై కీలక ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం. డిమాండ్లను పరిష్కరించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లతో ఇవాళ ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. వైద్యా రో గ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆ శాఖ కమిషనర్ కె.భాస్కర్, ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర లతో ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు.

ఎన్ సిడిసి సర్వేను ఆశా వర్కర్లతో చేయించడం వల్ల పని భారం పెరిగిందని తక్షణమే నిలిపివేయాలని ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంఘం కోరింది. గౌరవ వేతనం రూ. 10 వేల నుంచి రూ. 15 వేలకు పెంపు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు తదితర అంశాలపై మరోమారు ఏపీ ప్రభుత్వంతో చర్చ జరుపనున్నారు.
వీటిపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది జగన్ ప్రభుత్వం. రంపచోడవరంలో అధిక ఇంజెక్షన్ డోస్ కారణంగా గర్భిణీ ఆశా వర్కర్ మృతి చెందిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆశా వర్కర్లకు కొత్త ఫోన్ల పంపిణీ పైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది జగన్ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news