బాబాయ్ హత్యకేసు నుంచి బయటపడడానికి జగన్ ఢిల్లీ పర్యటనలు – బోండా ఉమ

-

బాబాయ్ హత్య కేసు నుంచి బయటపడడానికే సీఎం జగన్ వరుస ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వర రావు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు జగన్ ని విశ్వసించడం లేదని ఐ ప్యాక్ సర్వే తేల్చిందన్నారు. అయితే సర్వే చూశాక జగన్ ని నమ్మి ఎన్నికల బరిలో నిలవడానికి ఎవరు సాహసించడం లేదన్నారు. పేర్ని నాని వచ్చే ఎన్నికలలో ఎందుకు పోటీ చేయాలంటున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు.

175 నియోజకవర్గాలలో వైసీపీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో చెప్పే దమ్ము, ధైర్యం పేర్ని నానికి, సీఎం జగన్ కి ఉన్నాయా? అని ప్రశ్నించారు. పేర్ని నానికి డిపాజిట్లు రావని గతంలోనే చెప్పానని.. దమ్ముంటే సొల్లు పురాణాలు చెప్పడం మాని ప్రజాక్షేత్రంలో టిడిపి తో తేల్చుకోవాలని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version