మంత్రి పదవుల విషయంలో జగన్ కీలక నిర్ణయం…?

-

ఏపీలో మంత్రి వర్గ విస్తరణ ఏమో గాని ఇప్పుడు చాలా మంది నేతలు మంత్రి వర్గ విస్తరణపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. కీలక నేతలుగా ఉన్న ఎందరో ఇప్పుడు మంత్రి పదవులు దక్కుతాయి అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అనూహ్యంగా సిఎం జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరికి కూడా మంత్రి పదవులు ఇవ్వొద్దు ఎమ్మెల్సీలకు ఇవ్వాలి అని భావిస్తున్నారు.

ap cm jagan mohan responds to a heinous incident happened in srikakulam

అవును త్వరలో ఏపీలో కొన్ని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దాదాపు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరు అయితే ఎమ్మెల్సీలు గా గెలుస్తారో వారిలో ఇద్దరినీ కేబినేట్ లోకి తీసుకోవాలని అలాగే శాఖలను మార్చాలి అని సిఎం జగన్ భావిస్తున్నారు. ఇప్పుడు ఉన్న వారిలో ఎవరిని కేబినేట్ లో తీసుకున్నా సరే అనవసరంగా కొత్త ఇబ్బందులు వస్తాయని ఎమ్మెల్యేలను పక్కన పెట్టారట.

Read more RELATED
Recommended to you

Latest news