జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి రాజీనామాకు ఆమోదం

-

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి భోగ శ్రావణి జనవరి 25న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మీడియా ముందు కంటతడి పెట్టిన భోగ శ్రావణి.. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనని ఓర్వలేక టార్చర్ చేశాడని ఆరోపించింది. బీసీ మహిళ ఎదగడం చూసి ఓర్వలేక ప్రతి తప్పుకి తనని బాధ్యుల్ని చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

అంతేకాకుండా తనకి చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టొద్దని ఎమ్మెల్యే హుకుం జారీ చేశారని కన్నీళ్లు పెట్టుకుంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వల్ల తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తన కుటుంబానికి ఏదైనా జరిగితే సంజయ్ కుమార్ కారణం అవుతారని హెచ్చరించింది. కాగా నేడు భోగ శ్రావణి రాజీనామాను జిల్లా కలెక్టర్ రవి ఆమోదించారు.

శ్రావణి రాజీనామా ఆమోదంపై తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో కలెక్టర్ రవి శ్రావణిని కలెక్టరేట్ కి పిలిపించారు. రాజీనామా ఒత్తిడితో చేశారా? లేక సొంత నిర్ణయం తీసుకున్నారా? అని అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. అయితే శ్రావణి క్లారిటీ ఇవ్వడంతో ఆమె రాజీనామాకు జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version