జమ్మల మడుగులో మారిన రాజకీయం.. !

-

కడప జిల్లా జమ్మలమడుగులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈరోజు మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి ఇంటికి  ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు, ఇంచార్జ్ సురేష్ బాబు వెళ్ళారని తెలుస్తోంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు అగ్ర నేతల ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.

ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరు నేతలు కలసి పని చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఆ దిశగా జిల్లా నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందుకే ఇద్దరు నేతలను ఎంపీ అవినాష్ రెడ్డి కలిపి మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ ప్రయత్నం ఎందాక సఫలం అవుతుందో వేచి చూడాలి మరి. 

Read more RELATED
Recommended to you

Latest news