జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్య… మహిళా టీచర్ హత్య

-

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు ముష్కరులు. అమాయకమైన పౌరులను పొట్టన పెట్టుకుంటున్నారు. హిందువులు, ముస్లింలు అన్న తేడా లేకుండా భారత దేశానికి మద్దతుగా నిలుస్తున్న వారిని చంపుతున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో టీవీ ఆర్టిస్ట్ అమ్రిన్ భట్ ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. కుల్గామ్ జిల్లా గోపాల్ పొరా హైస్కూల్ మహిళా టీచర్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా తుపాకీ కాల్పుల గాయాలైన మహిళా టీచర్ చనిపోయింది. చనిపోయిన మహిళా టీచర్ ను సాంబా నివాసి అయిన హిందూ మహిళగా గుర్తించారు.

ఇదిలా ఉంటే ఘటన జరిగిన ప్రాంతాన్ని దిగ్భందించాయి భద్రతా బలగాలు. అన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించి వెంటనే తటస్థీకరిస్తామని కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. గత వారం కాశ్మీరీ టివీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ ను కాల్చి చంపారు ఉగ్రవాదులు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఈ దురాగతానికి పాల్పడిని లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులను 24 గంటల్లో మట్టుపెట్టాయి భద్రతా బలగాలు.

Read more RELATED
Recommended to you

Latest news