Breaking : గుట్కా తినండి.. ఆల్కాహాల్ తాగండి.. బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు..

-

మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా మరోసారి వార్తల్లో నిలిచారు. ఎంపీ జనార్థన్ మిశ్రా నీటి సంరక్షణ అంశంపై మాట్లాడుతున్న క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వాళ్లందరినీ షాక్కు గురి చేశాయి. అప్పటిదాకా ఆయన చేసిన వ్యాఖ్యలను ఆసక్తిగా విన్న జనం.. చివర్లో ఆయన ఇచ్చిన ట్విస్ట్లో కంగుతిన్నారు. రేవా ఎంపీ జనార్ధన్ మిశ్రా.. తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో.. “నీళ్లు లేక భూములు ఎండిపోతున్నాయి. కాబట్టి, వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. గుట్కా అయినా తినండి.. లేదంటే ఆల్కాహాల్ అయినా తాగండి.. లేదంటే మత్తు పదార్థాలకు ప్రత్యామ్నాయాలనైనా ప్రయత్నించండి.

Come to me only if corruption amount is over Rs 15 lakh': BJP MP | India  News,The Indian Express

 

కానీ, నీటి విలువను అర్థం చేసుకోండి అంటూ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని రేవా బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగాలని, గుట్కా నమలాలని, థిన్నర్ పీల్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రేవాలో నీటి పరిరక్షణపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. నీళ్లు లేక భూములు ఎండిపోతున్నాయని, కాబట్టి వాటిని రక్షించాలని పేర్కొన్న ఆయన.. ‘‘గుట్కా నమలండి, మద్యం తాగండి, థిన్నర్‌ను పీల్చండి. సులేసాన్ (ఒక రకమైన జిగురులాంటి పదార్థం) లేదంటే ఐయోడెక్స్ తినండి. కానీ, నీళ్ల ప్రాముఖ్యతను మాత్రం అర్థం చేసుకోండి’’ అని వ్యాఖ్యానించారు జనార్ధన్ మిశ్రా.ఇటీవల టాయిలెట్‌ సింక్‌ను చేతితో శుభ్రం చేసి వార్తల్లోకి ఎక్కి ఎంపీకూడా ఈయనే.

Read more RELATED
Recommended to you

Latest news