జాన్వీ కపూర్ తన ఫాలోయర్స్ గురించి బలే చెప్పిందే.!

-

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే గుడ్ లక్ జెర్రీ, మిలీ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్స్ లో జాన్వీ కపూర్ రూటే సపరేటు. ఎప్పటికప్పడు తన అందంతో కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంది.

వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిన జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది.

అయితే తాజాగా తన సోషల్ మీడియా ఫాలోయింగ్ పై జాన్వీ సంచలన వ్యాఖ్యలు చేసింది. జాన్వీ మాట్లాడుతూ ఫాలోయింగ్ తన సినీ కెరీర్ కి ఎలాంటి ఉపయోగం లేదని పేర్కోంది. ఎందుకంటే నాకు సోషల్ మీడియాలో 21 మిలియన్ మంది  ఫాలోవర్స్ ఉన్నారు.నిజంగా వాళ్ళందరూ నేను నటించిన ‘మిలీ’ సినిమా చూసి ఉంటే అది పెద్ద హిట్ అయ్యేది. కాని ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందంటే వాళ్ళు కారణం కాదు, అలా అనుకుంటే అర్దం లేని పని , నన్ను ఫాలో అయితే నా సినిమాలు చూడాలని రూల్ లేదని కుండ బద్దలు కొట్టినట్లు గా మాట్లాడింది.

Read more RELATED
Recommended to you

Latest news