విద్యార్థులకు శుభవార్త.. జేఈఈ అడ్మిట్‌ కార్డులు విడుదల

-

అడ్మిట్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్న జేఈఈ విద్యార్థులకు శుభవార్త. జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో, మొదటి విడత హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దేశంలో 501 నగరాలతో పాటు, విదేశాల్లోని 21 నగరాల్లో జేఈఈ మెయిన్ నిర్వహిస్తుండడం విశేషం.

JEE Mains 2022: NTA to announce exam dates soon, check application process,  paper pattern and more

ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) అన్ని ఏర్పాట్లు చేసింది. జేఈఈ పరీక్షలపై ఎన్టీయే స్పందిస్తూ… హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అంశంలో ఏవైనా సమస్యలు తలెత్తితే 011-40759000 ఫోన్ నెంబరులో గానీ, [email protected] మెయిల్ ద్వారా గానీ సంప్రదించాలని సూచించింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమకు కరోనా లక్షణాలు లేవని సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news