జీవన్ రెడ్డి నీ కుప్పి గంతులు ఇక సాగవు : టీడీపీ నాయకులు

-

మహా నటుడు మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పుట్టి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు శతజయంతి ఉత్సవాల పేరిట తెలుగు జాతి ఆత్మగౌరవానికి వందేళ్లు పూర్తి పేరిట కార్యక్రమాలు జరిపించారు . ఈ నేపధ్యం లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కార్యకర్తలు అందరూ కలిసి ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల ఎమ్మార్ గార్డెన్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను బుధవారం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కోఆర్డినేటర్ దేగం యాద గౌడ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిపించారు నాయకులు.

TDP to 'strongly oppose' ruling YSRCP in upcoming municipal polls

చాలా రోజుల తర్వాత పార్టీ శ్రేణులలోని కార్యకర్తలు, నాయకులు కలుసుకొని స్వర్గీయ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు పేదల పట్ల ఆయన కున్న బాధ్యత గురించి మాట్లాడుకుని నేటి నాయకులలో ప్రజల సంక్షేమం పక్కన పెట్టి సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ సమావేశం లో ముఖ్యఅతిథి అలీ మస్కతి ప్రసంగిస్తూ.. రానున్న ఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీకి బంగపాటు తప్పదని అన్నారు వారు. బలమైన ప్రతిపక్ష పార్టీగా టిడిపి పార్టీ ఉంటుందన్నారు వారు. జీవన్ రెడ్డి నీ కుప్పి గంతులు ఇక సాగవు అని పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news