నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలోనే అన్ని జిల్లాల్లో జాబ్ మేళా

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ రాష్ట్ర ట్రైనింగ్ అండ్ ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో త్వరలో అన్ని జిల్లా కేంద్రాల్లో జాబ్ మేల నిర్వహించబోతున్న టు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్ తెలిపారు. శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ రాష్ట్ర ట్రైనింగ్ అండ్ ఉపాధి సంస్థ, సెట్విన్ సంయుక్తంగా యూత్ హాస్టల్ ఆవరణలో నిర్వహించిన జాబ్ మేళా ను యూత్ సర్వీసెస్ శాఖ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్ల తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సవ్యసాచి ఘోష్ మాట్లాడుతూ… ప్రస్తుతం నిర్వహించిన జాబ్ మేళ లో దాదాపు 60 కంపెనీల కు చెందిన ప్రతినిధులు హాజరై నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. దాదాపు 8 వేల మంది నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళా లో పాల్గొన్నారని తెలిపారు.

మార్చి 5వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో, ఆరవ తేదీన ఖమ్మం జిల్లాలో జాబ్ మెల్ల నిర్వహించనున్నట్లు ప్రకటన చేశారు. ఇలా వరుసగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మార్చి మాసంలో జాబ్మేళా నిర్వహిస్తామని స్పష్టం చేశారు సవ్యసాచి ఘోష్. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు కచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version