తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. మరో 382 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

-

తెలంగాణలో నిరుద్యోగులకు కెసిఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే చాలా పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం…. మరిన్ని పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగానే తాజాగా… తెలంగాణలో 15 కొత్త అగ్నిమాపక కేంద్రాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి 382 పోస్టులను మంజూరు చేసింది. ఇందులో 367 శాశ్వత పోస్టులు కాగా, మిగిలిన వాటిని కాంట్రాక్టు పద్ధతి ద్వారా భర్తీ చేయాలని సూచించింది.   ఇక ఈ ప్రకటనతో తెలంగాణ నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news