మాజీ డిప్యూటీ సీఎంల మధ్య మాటల యుద్ధం !

-

వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎం ల మధ్య వివాదం ముదురుతోంది. ఎమ్మెల్యే రాజయ్యని ఉద్దేశిస్తూ కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేతకాని వాడు చెల్లని రూపాయి అంటూ రాజయ్యని కడియం శ్రీహరి విమర్శించారు. నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు వసూళ్ళకు పాల్పడినట్టు కనుక నిరూపిస్తే ముక్కు నెలకు రాస్తానని ఆయన అన్నారు. 

పదవులు అమ్ముకుంటున్నారు, పనులు అమ్ముకుంటున్నారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నెత్తి మీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రాజయ్యని ఉద్దేశిస్తూ  ఎద్దేవా చేశారు. మొత్తం మీద స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య వార్ ముదురుతోంది. నిజానికి గతంలో రాజయ్యకు ఉన్న మంత్రి పదవి తీసేసి మరీ కడియం శ్రీహరికి కేసీఆర్ అప్పగించారు. దీంతో అప్పటి నుండి ఈ వార్ కొనసాగుతోంది అని చెప్పాలి. 

Read more RELATED
Recommended to you

Latest news