జెట్ స్పీడ్ లో కమలహాసన్.. ఏకంగా 4 క్రేజీ ప్రాజెక్ట్స్..!!

-

విశ్వ నటుడు కమలహాసన్ గురించి , ఆయన నటనా విధానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఐదు పదుల వయసు దాటినా కూడా అంతే ఎనర్జిటిక్ తో సినిమాలలో నటిస్తున్నారు అంటే ఇక ఆయనకు నటనపై ఎంత ఇష్టం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కమల్ నటించిన తాజా చిత్రం విక్రమ్. ఈ సినిమా జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై విపరీతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. థియేటర్ రన్ ముగించుకోవడంతో ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా అదరగొడుతుందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ చూసి ఆయనలో ఉత్తేజం మరింత పెరిగిందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏకంగా 4 క్రేజీ సీక్వెల్స్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం భారతీయుడు 2 షూటింగ్లో పాల్గొనబోతున్నారు కమలహాసన్. ఈ సినిమా వచ్చే యేడాది రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాతో పాటు సూపర్ హిట్ సైకోథ్రిల్లర్ రాఘవన్ పార్ట్ 2 లో కూడా నటిస్తున్నారు కమలహాసన్. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక వీటితోపాటు విజయ్, కార్తీలతో సినిమాల తర్వాత లోకేష్ కనకరాజు కమల్ తో విక్రమ్ 2 సినిమా కూడా చేయనున్నారు. ఇక ఈ మూడు కాకుండా శభాష్ నాయుడుకు కూడా సీక్వెల్ రానుంది. 2018 లోనే షూటింగ్ ప్రారంభించి మధ్యలోనే ఆగిపోయిన ఈ సినిమాలో కమల్ దశావతారం సినిమాలో బలరామ్ పాత్రలో నటించినున్నారు.

ఇకపోతే ఇలా ఒకేసారి నాలుగు క్రేజీ సీక్వెల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరొకసారి బిజీ కానున్నాడు కమలహాసన్. ఇక విక్రం సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఓవర్సీస్ నుంచి 120 కోట్ల రూపాయల లాభం చేకూరింది. అంతేకాదు ఇప్పటివరకు రూ.404 కోట్ల రూపాయల రాబట్టి తమిళ్ ఇండస్ట్రీలో అత్యంత అరుదైన ఘనత సాధించిన రెండవ తమిళ్ సినిమాగా విక్రమ్ నిలిచింది.

 

Read more RELATED
Recommended to you

Latest news