మళ్లీ సెట్స్ పైకి 26 ఏళ్ల క్రితం ఆగిపోయిన కమల్ హాసన్ మూవీ..

-

తమిళ స్టార్ హీరో కమల్​హాసన్ నటించబోతున్న ఓ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. దాదాపు 26 ఏళ్ల క్రితం మొదలైన ఒక సినిమా కొన్ని కారణాలతో ఆగిపోగా మళ్లీ ఈ చిత్రాన్ని కమలహాసన్ పున ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

తమిళ విలక్షణ నటుడు కమలహాసన్ కు సంబంధించి తాజాగా ఒక విషయం వైరల్ గా మారింది. 1997లో కమల్​ టైటిల్‌ పాత్రను పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం మరుదనాయగన్.. కాగా ఈ సినిమా చిత్రీకరణ దశలోనే ఆగిపోయింది. అయితే మళ్ళీ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి ఆలోచనలో ఉన్నారట కమల్ హాసన్. ఇప్పటికే పలుమార్లు ఈ చిత్రం తన కలల చిత్రం అని అనుకోకుండా ఆగిపోయింది అంటూ కమల్ హాసన్ ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు.

1997లో ప్రారంభమైన మరుదనాయగన్ సినిమా ప్రారంభోత్సవానికి ఇంగ్లాండ్​ రాణి ఎలిజబెత్‌ సైతం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈమెతో పాటు అప్పటి తమిళనాడు సీఎం కరుణానిధి మరో రాజకీయ నాయకుడు శివాజీగణేశన్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో ఘనంగా ప్రారంభమైన చిత్రీకరణ కొంత భాగం పూర్తయిన తర్వాత బడ్జెట్ కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది షూటింగ్ పూర్తి కాకుండా ఆగిపోవడంతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాపై పలుమార్లు మాట్లాడిన కమల్ హాసన్ ఎప్పటికైనా చిత్రీకరణ పూర్తి చేసి చేస్తానంటూ చెప్పుకొచ్చారు. అలాగే హాలీవుడ్‌ నిర్మాతలూ సైతం భాగం అవుతారని పలు సార్లు చెప్పారు.

కాగా ఇటీవలే తమిళంలో పోనియన్ సెల్వం సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది తెలుగులో సైతం బాహుబలి సినిమా విజయం సాధించడంతో చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలోని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని అందుకే మళ్ళీ ఈ సినిమాను కమల్ హాసన్ ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో ఈ సినిమాలో టైటిల్ కమల్ హాసన్ పోషించగా ఇప్పుడు మాత్రం ఈ స్థానంలో విక్రమ్ తీసుకున్నందుకు సన్నహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా చిత్ర బృందం నుంచి అధికార ప్రకటన వచ్చేంతవరకు ఎదురుచూడాల్సిందే. కాగా ప్రస్తుతం ఈయన ఇండియన్‌-2 చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version