జ్ఞానవాపి మసీదు వివాదం పై స్పందించిన కంగనా రనౌత్

-

వారణాసిలోని జ్ఞాన వాపి మసీదు నీటి కుండ లో శివలింగం బయటపడడం పట్ల ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించింది. కాశీలో ఎక్కడ చూసినా శివుడేనని ఆమె వ్యాఖ్యానించింది. శివుడు కాశీ లోని ప్రతి అణువులో ఉన్నాడని, దానికి నిర్మాణం అవసరం లేదని ఆమె పేర్కొంది. వివాదాస్పద వ్యాఖ్యలు, కంటెంట్ దృశ్య ఆమెపై ట్విట్టర్ నిషేధం విధించడం తెలిసిందే. దీంతో ఆమె వ్యాఖ్యలను ఏఎన్ఐ వార్తా సంస్థ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

” మధురలో ప్రతి అణువణువునా కృష్ణపరమాత్ముడు ఉంటాడు. అలాగే అయోధ్యలోని ప్రతి భాగంలోనూ రాముడు ఉంటాడు. అదే మాదిరి కాశీలోని ప్రతి అణువులోనూ మహేశ్వరుడు ఉంటాడు. ఆయనకు నిర్మాణం అవసరం లేదు. ఆయన ప్రతి కణంలోనూ నివసిస్తూ ఉంటాడు.” అని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. కంగనా రనౌత్ తాజాగా ‘థాకడ్’ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందు చిత్రబృందం కాశీవిశ్వేశ్వరుని దర్శించుకుంది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు జ్ఞానవాపి మసీదుపై స్పందించాలి అంటూ ఆమెను కోరడంతో ఈ విధంగా వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news