బీజేపీ పార్టీలో చేరిన కరాటే కళ్యాణి

-

టాలీవుడ్‌ స్టార్‌ నటి కరాటే కళ్యాణి భారతీయ జనతా పార్టీ లో చేరారు. ఆదివారం రోజున తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సమక్షంలో కరాటే కళ్యాణి… బీజేపీ తీర్థం పుచ్చకున్నారు. కరాటే కళ్యాణి తో పాటు జల్పల్లి కౌన్సిలర్‌ యాదయ్య మరియు పలుగురు టాలీవుడ చిత్ర పరిశ్రమకు చెందిన నటులు బీజేపీ లో చేరారు.

అయితే.. ఈ సందర్భంగా మాజీ ఎంపీ విజయశాంతి మాట్లాడుతూ… ఎందరో త్యాగాలతో దేశాన్ని దక్కించుకోగలిగామంటూ.. అమర వీరుల త్యాగాలకు సెల్యూట్‌ చెప్పారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మాత్రం రాక్షసుల చేతుల్లోకి వెళ్లిందని నిప్పులు చెరిగారు. నిజంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ లో సరైన పార్టీ అని తెలిపారు. తెలంగాణ బీజేపీ పార్టీ చేతుల్లోకి వెళితేనే.. అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. 2023 లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఆ మేరకు పార్టీ నేతలందరూ కష్టపడి పనిచేయాలని కోరారు విజయ శాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version