‘రాహుల్ ప్రధాని అవుతారు’.. స్వామీజీ జోస్యం

-

కాంగ్రెస్ ​ప్రధాన నేత రాహుల్​గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఓ స్వామీజీ జోస్యం చెప్పారు. కర్ణాటక చిత్రదుర్గలోని శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠ్‌ను రాహుల్‌ గాంధీ సందర్శించిన సందర్భంగా ఆ స్వామీజీ వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠ్‌ను సందర్శించి మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుఘ శరణరు నుంచి ‘ఇష్టలింగ దీక్ష’ను స్వీకరించారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

సాధారణంగా లింగాయత్ ​సామాజిక వర్గానికి చెందినవారు మాత్రమే ఈ ఆచారాన్ని పాటిస్తారు.అ యితే, ఈ క్రమంలోనే హవేరి హోసముట్​ స్వామీజీ రాహుల్‌ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ​ప్రధానమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ‘ఇందిరా గాంధీ ప్రధానిగా పనిచేశారు. రాజీవ్​ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు రాహుల్ ​గాంధీ లింగాయత్​ శాఖలోకి ప్రవేశించారు కాబట్టి ఈయన కూడా పీఎం అవుతారు’ అని అన్నారు.

అయితే ఇంతలోనే జోక్యం చేసుకున్న మఠాధిపతి శివమూర్తి.. అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్వామీజీని అడ్డుకున్నారు. ఇది రాజకీయ వేదిక కాదని, ప్రజలే దానిని నిర్ణయిస్తారని చెప్పారు.

హుబ్బళ్లిలో కాంగ్రెస్​ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశానికి హాజరయ్యేందుకు రాహుల్​ మంగళవారమే కర్ణాటక చేరుకున్నారు. ఆ రాత్రి జరిగిన భేటీలో.. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధత గురించి రాష్ట్ర కాంగ్రెస్​ నేతలతో చర్చలు జరిపారు. బుధవారం కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య 75వ జన్మదిన వేడుకలకు కూడా రాహుల్​ హాజరయ్యారు​.

Read more RELATED
Recommended to you

Latest news