అయ్యన్న పచ్చి తాగుబోతు..బుద్దా వెంకన్న అమ్మాయిల బ్రోకర్‌ – మంత్రి కారుమూరి

-

అయ్యన్న పచ్చి తాగుబోతు..బుద్దా వెంకన్న అమ్మాయిల బ్రోకర్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. అయ్యన్నపాత్రుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. ఎవరూ అతీతులు కాదన్నారు. చంద్రబాబు అసలు ఏ పార్టీ నుండి వచ్చారు? టీడీపీలోకి వెళ్లి ఆ పార్టీని కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు అని నిప్పులు చెరిగారు.

పార్టీని, బ్యాంకు బ్యాలెన్స్ కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు.. చంద్రబాబు తరహాలోనే అయ్యన్నపాత్రుడు నడుస్తున్నారన్నారు. మీరు తప్పు చేసి దాన్ని బీసీలపై రుద్దటం ఏంటి? బీసీలు సెక్రటేరియట్ కి వస్తే తోక కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు.. అలాంటి వ్యక్తి బీసీలకి ఎలా న్యాయం చేస్తాడు? అని ఆగ్రహించారు.

అయ్యన్నపాత్రుడు తప్పు చేస్తే చూస్తూ ఊరుకోవాలా? మహిళలు, ఎస్సీల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారని.. బాలకృష్ణ ఎంతటి దారుణమైన వ్యాఖ్యలు మహిళల గురించి చేశారో చూశామని గుర్తు చేశారు. బుద్దా వెంకన్న పది ఇళ్లు కూల్చుతానంటున్నాడని.. బెజవాడలో మహిళలతో కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపిన చరిత్ర అతనిదని ఆరోపించారు. రిషితేశ్వరి, వనజాక్షిపై దాడుల కేసుల్లో చంద్రబాబు ఏం చేశారో ప్రజలంతా చూశారు.. జగన్ వచ్చాకే బీసీలకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news