టీఆర్ఎస్ సింహం లాంటింది…న్యాయం, ధ‌ర్మం మావైపే ఉన్నాయి : క‌విత.

-

టిఆర్ఎస్ పార్టీ సింహం లాంటిది.. తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ పార్టీ రారాజు గా నిలిచి పోయిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మూసిబుద్ధిన్గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రసంగించారు. నీళ్లు, నిధులకెడ్చిన తెలంగాణ కోసం పట్టుదలతో ముందుకొచ్చిన నేత కేసీఆర్ అని.. ప్రజల మద్ధతు తో కేసీఆర్ తెలంగాణ సాధించారని గుర్తు చేశారు.


సత్యం చెప్పి ఉద్యమం చేశారు.. నిజం చెబుతూనే రాష్ట్ర అభివృద్ధి చేశారని.. ఏం చేస్తామో అదే చెప్పడం కేసీఆర్ నైజమని వెల్లడించారు. భాజపా, కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలినప్పుడు.. మనం చేసిన అభివృద్ధి పనులను చెప్పి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న పనులను తెలుసుకోవాలని.. కరోనా సమయంలోనూ తెరాస అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని పేర్కొన్నారు. మనం రైతులకు అన్నం పెడితే.. మోదీ సున్నం పెడుతున్నారన్నారు. మోటర్లకు మీటర్లు పెడతామని మోదీ అంటే.. ఒక్క భాజపా నాయకుడు మాట్లాడుతలేరని.. దిల్లీ అయినా, గల్లీ అయినా పేద ప్రజల తరపున గొంతెత్తేది తెరాస మాత్రమేనని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news