కెసిఆర్ తెలంగాణను సర్వనాశనం చేసిండు: వివేక్ వెంకటస్వామి

-

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాక్షస పాలన జరుగుతుందన్నారు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి.18 వ రోజు నారాయణపేటలో జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ తో పాటు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.నారాయణపేట మండలం అంత్వార్ గేట్ నుంచి ప్రారంభమైన ఇవాల్టి పాదయాత్ర కొల్లంపల్లి, లింగంపల్లి గేట్, ధన్వాడ మీదుగా మణిపూర్ తండా వరకు సాగనుంది.కెసిఆర్ ది అవినీతి పాలన అని విమర్శించారు వివేక్ వెంకటస్వామి.కెసిఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయిందన్నారు.

రైతులను కోటీశ్వరులుగా చేస్తానని బికారులుగా మార్చారు అంటూ ఫైర్ అయ్యారు.కాంట్రాక్టర్ మెగా కృష్ణా రెడ్డి ని మాత్రం కోటీశ్వరుడి ని చేశారని విమర్శించారు పెద్దపెల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి.సీఎం కేసీఆర్ తెలంగాణను సర్వ నాశనం చేశారన్నారు.ఆయుష్మాన్ భారత్ ను కేంద్రం ప్రవేశపెట్టినా తెలంగాణలో అమలు చేయడం లేదని అన్నారు వివేక్ వెంకటస్వామి.

Read more RELATED
Recommended to you

Latest news