‘కారు’కు ‘బండి’ రివర్స్ గేర్!

-

ఏదో వెనుకటికి.. తాడిని తన్నేవాడు ఉంటే…తాడిని తన్నిన వాడి తల తన్నే వాడు ఉంటాడనే సామెత అందరికీ తెలిసిందే. సామెత బట్టి చూసుకుంటే..కేసీఆర్ మళ్ళీ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించి..మళ్ళీ ప్రజల మద్ధతు పొందేందుకు చూస్తుంటే…ఆ సెంటిమెంట్ కు విరుగుడు మందు వేసి..సరికొత్త అస్త్రాన్ని వాడి సక్సెస్ అవ్వడంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముందు ఉంటున్నారు. గతంలో రెండుసార్లు తెలంగాణ సెంటిమెంట్ రాజేసి కేసీఆర్ సీఎం అయ్యారు.

ఇప్పుడు కూడా అదే తరహాలో రాజకీయం చేస్తున్నారు…గతంలో తెలంగాణకు శత్రువులు ఆంధ్రా నేతలు అని చెప్పారు…ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేశారు. ఇప్పుడు మోదీ..తెలంగాణకు శత్రువు అని మాట్లాడుతున్నారు. బీజేపీ వస్తే రాష్ట్రం నాశనమైపోతుందనే కోణంలో మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. కానీ ప్రతిసారి సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ది పొందాలంటే అయ్యే పని కాదు. ప్రజలు అన్నీ సార్లు గుడ్డిగా నమ్మేయరు.

అలాగే కేసీఆర్ సెంటిమెంట్ కు బండి సంజయ్ విరుగుడు మందు వేస్తున్నారు. “బీజేపీ మద్దతు ఇవ్వకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా..? ఈ పీకుడుగాళ్లు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యేవారా..?’’ అని బండి కౌంటర్ ఇచ్చారు. ఇక కేసీఆర్‌ అంటే ఖాసిం చంద్రశేఖర్‌ రజ్వీ అని నిజాం రజాకార్లతో పోల్చారు. దీని ద్వారా హిందూ మతం కార్డుని బండి వాడుతున్నట్లు కనిపిస్తోంది.

కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ లేపితే బండి…హిందూ మతం కార్డు వాడుతున్నారు. హిందువులు పూర్తిగా కేసీఆర్ కు వ్యతిరేకమయ్యేలా చేస్తున్నారు. ఇప్పటికే జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో ఈ ఫార్ములా బాగానే వర్కౌట్ అయింది. పదే పదే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తే…బండి ఇలాగే సమాధానం చెప్పేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news