షాంపేన్ బాటిల్ పట్టుకున్న కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్…. ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ

-

రాహుల్ గాంధీ నేపాల్ ఖాట్మాండు పర్యటన కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ క్రియేట్ చేసింది. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ తన స్నేహితుడి పెళ్లికి ఖాట్మాండు వెళ్లిన క్రమంలో అక్కడ ఓ నైట్ క్లబ్, చైనా మహిళా దౌత్యవేత్తతో ఉన్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. రాహుల్ గాంధీ పెళ్లిలో పాల్గొంటే తప్పేంటని ప్రశ్నిస్తోంది. పెళ్లిల్లో పాల్గొనడాన్ని కూడా బీజేపీ చట్టవ్యతిరేఖ కార్యక్రమంగా చూస్తోందని ఎద్దేవా చేసింది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ ఓ ఆసక్తికర ట్వీట్ పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఓ పార్టీలో ఉన్న ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో ప్రకాష్ జవదేకర్ షాంపేన్ బాటిల్ ను ఓపెన్ చేస్తూ కనిపిస్తున్నారు. మానిక్కం ఠాగూర్ ఈ ఫోటోను పోస్ట్ చేసి… ‘ ఇతను ఎవరు..?’ అంటూ సెటైరికల్ గా కామెంట్ చేశారు. ప్రస్తుతం మానిక్కం ఠాగూర్ పోస్ట్ చేసిన ఈ ఫోటో మరెంత రాజకీయ రచ్చకు దారి తీస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news