మారో 4 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న కియారా అద్వానీ..!

-

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ- సిద్ధార్థ మల్హోత్ర జంట పెళ్లికి రెడీ అవుతున్నారంటూ కథనాలు వినబడుతున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ పెళ్లికి సిద్ధం అవుతున్నారు అంటూ పెళ్లికి సంబంధించిన చివరి దశ పనులు కూడా సాగుతున్నాయి అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన వీరు వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చినా ఇప్పటివరకు వీరిద్దరూ ఇలాంటి పుకార్లపై పెదవి విప్పలేదు. అయితే అభిమానుల కోసం ఈ జంట త్వరలోనే పెద్ద ప్రకటన చెప్పబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాబోయే వధూవరుల నుంచి ఎటువంటి సమాచారం అందకపోయినా జరుగుతున్న పనుల తీరును బట్టి పెళ్లి తేదీ దూరంలో లేదని క్లారిటీ వచ్చింది.

పెళ్లి ప్రత్యేకంగా ఉండాలని స్పెషల్ డే కోసం తెగ తికమక పడుతున్నట్లు సమాచారం . ఇద్దరూ కూడా చివరి రౌండు సన్నాహాలలో ఉన్నారని తెలుస్తోంది . ఈ జంట పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో రాజస్థాన్ లోని జై సల్మేర్ లో వీరి వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది. సన్నిహితులు బంధుమిత్రులను ఇరు కుటుంబాల కొద్దిమంది సమక్షంలోనే వీరి వివాహం జరగబోతోందట. ఇప్పటికే వీరి పెళ్లి కోసం ఇండస్ట్రీ నుండి కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా , అశ్విని యార్డి తోపాటు మరికొంతమంది బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ వెడ్డింగ్ కి హాజరవుతున్నారని భావిస్తున్నారు.

అంతేకాదు ఆ డేట్ కోసం ఖరారు చేయడానికి సిద్ధార్థ మల్హోత్రా ఢిల్లీలోని తన ఇంటికి వెళ్లినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. పర్సనల్ టచ్ ఇవ్వడానికి మల్హోత్రా స్వయంగా వివాహ సలహాలు చూస్తున్నాడట. తాజా కథనాల ప్రకారం షేర్షా సిద్ధార్థ వివాహం కోసం తన కుటుంబ స్నేహితులు , బంధువులతో కలిసి ఢిల్లీ నుండి నేరుగా పంజాబ్ చేరుకోనున్నారు. మరి అధికారికంగా ప్రకటిస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news