పెళ్లి పీటలు ఎక్కబోతున్న బీటౌన్‌ బ్యూటీ కియారా అద్వానీ

-

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ కియారా అద్వానీ-సిద్దార్థ్‌ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. తమ ప్రేమను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ మీడియా కెమెరాలకు చిక్కుతుండటంతో వీరద్దరి మధ్య సమ్‌థింగ్‌, సమ్‌థింగ్‌ నడుస్తోందని అంతా ఫిక్స్‌ అయ్యారు. అయితే.. తన ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడబోతోంది. వీరి వివాహం ఫిబ్రవరి 6న జరగబోతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఉన్న ప్యాలెస్ హోటల్ లో వివాహ వేడుక జరగబోతోంది.

ఇక ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మెహిందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయి. 2020 నుంచి కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలు డేటింగ్ లో ఉన్నారు. మహేశ్ బాబు చిత్రం ‘భరత్ అనే నేను’ ద్వారా టాలీవుడ్ లోకి కియారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటించింది. ఇప్పుడు రామ్ చరణ్ సరసన మరో చిత్రంలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news