ఆవిర్భావ వేళ ఎంపీ రాము ఏమ‌న్నారంటే…

-

శ్రామికుడి కష్టం నుంచి, కార్మికుడు శ్ర‌మ‌కోర్చి కరిగించిన కండ‌రాల శ‌క్తి నుంచి, రైతుల స్వేదం నుంచి, నిరుపేదల  ఆశ‌ల నుంచి, కష్టజీవుల ఆకాంక్ష‌ల నుంచి, తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం, తెలుగువాడి పౌరుషం చాటి చెప్పటం కోసం పుట్టింది ఈ తెలుగుదేశం!” అని వ్యాఖ్యానిస్తూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు ఉంచారు యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు. తెలుగు జాతి  ఉన్నంతవరకు, పసుపు జెండా బలంగానే ఉంటుంది..అని, తెలుగు ప్రజలకు, టీడీపీ నాయకులకు కార్యకర్తలకు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు చెబుతున్నాన‌ని పేర్కొంటూ.. చివ‌ర్లో జై తెలుగుదేశం అని నిన‌దిస్తూ త‌న సంక్షిప్త సందేశాన్ని ముగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version