టీఆర్ఎస్​ బరితెగించి అధికార దుర్వినియోగం చేస్తోంది : కిషన్‌ రెడ్డి

-

మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌ రెడ్డి నేడు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లతో పాటు తదితరులు ఉన్నారు. అయితే.. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమని అన్నారు. కుటుంబ పాలన, అహంకార పూరిత పాలన పోవాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్​ బరితెగించి అధికార దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. మర్రి బీజేపీలోకి రావడం తెలంగాణలో.. పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందని అన్నారు కిషన్ రెడ్డి. శశిధర్ రెడ్డితో కలిసి తాము పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణకు దిక్కు అనేలా పాలన నడుస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Cabinet Reshuffle: G Kishan Reddy

తెలంగాణలో అభివృద్ధి ఆగిపోయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. తన కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపైనే కేసీఆర్​ దృష్టి పెట్టారన్నారు కిషన్ రెడ్డి. అందుకే బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని కల్వకుంట్ల కుటుంబం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్​ పార్టీ దుందుడుకు విధానాలతో తన గోతిని తానే తవ్వుకుంటోందని అన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగాలని.. ఆ సమయంలో మార్పు సాధించాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news