ఈటెలతో జస్ట్ ఫోన్ లో మాత్రమే మాట్లాడా: కేంద్ర మంత్రి

-

ఈటెల ఎపిసోడ్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు నేను ఈటలను కలవలేదు.. ఫోన్ లో మాత్రమే మాట్లాడాను అని అన్నారు. భవిష్యత్ లో ఈటెలతో చర్చలు జరుపుతాను అని ఆయన వ్యాఖ్యలు చేసారు. నన్ను కలిసేందుకు ఈటల సంప్రదించిన మాట వాస్తవమే అని ఆయన స్పష్టం చేసారు. అసెంబ్లీలోఈటెలతో కలసి 15ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను అని అన్నారు.

ఈటెలను ఎప్పుడు కలవాలనేది నిర్ణయించుకోలేదు అని అందర్నీ కలుస్తున్నాను.. నన్ను కూడా కలుస్తానని ఈటెల చెప్పారు అని అన్నారు. హుజూరాబాద్ కు ఉపఎన్నిక వస్తే పోటీ చేయాలా లేదా అనేది మాపార్టీలో చర్చించలేదు అని ఆయన స్పష్టం చేసారు. మా పార్టీలో గ్రూపులు ఉన్నయాని రేవంత్ రెడ్డికి ఎలా తెలుసు? అని నేను కేసీఆర్ కు అనుకూలమని ప్రచారం చేసే వాళ్ళను దేవుడే చూసుకుంటాడన్నారు. తెలుగు రాష్ట్రల నుంచి వివిధ పనుల కోసం ఢిల్లీకి వచ్చే వారికి ఖచ్చితంగా సాయం చేస్తాను అని ఆయన స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news