కొలికపూడి కొత్త డిమాండ్..టీడీపీలో శైలజకు సీటు?

-

అమరావతి పరిరక్షణ సమితి నాయకుడుగా ఉంటూ రాజకీయ విశ్లేషకుడుగా పని చేస్తున్న కొలికపూడి శ్రీనివాస రావు..కొత్త డిమాండ్‌కు తెరలేపారు. తెలుగుదేశం పార్టీలో రాయపాటి శైలజకు సీటు ఇవ్వాలని కోరారు. అది కూడా గుంటూరు జిల్లాలో సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయపాటి శైలజ..అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మొదట నుంచి ఉద్యమంలో యాక్టివ్ గా ఉంటున్న శైలజ..న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ అమరావతి టూ తిరుపతి పాదయాత్ర విజయవంతంగా నడపడంలో ముందున్నారు.

అమరావతి టూ అరసవెల్లి పాదయాత్రలో కీలకపాత్ర పోషించారు. అయితే పాదయాత్ర ఆగిపోయినా సరే..శైలజ అమరావతి ఉద్యమంలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అటు కొలికపూడి శ్రీనివాసరావు సైతం అమరావతి ఉద్యమంలోనూ..ఇటు రాజకీయాల్లోనూ కీలకంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అలాగే తెలుగుదేశం పార్టీకి మద్ధతుగా ఈయన కొందరు నేతలకు పోలిటికల్  స్ట్రాటజిస్ట్‌గా కూడా పనిచేస్తున్నారు. ఇక ఈయనకు నెక్స్ట్ ఎన్నికల్లో తెలుగుదేశం సీటు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది.

నందిగామ రిజర్వడ్ సీటు ఈయనకు కేటాయిస్తారని ప్రచారం ఉంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు గాని..తాజాగా రాయపాటి శైలజకు గుంటూరులో అసెంబ్లీ సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమెకు గుంటూరు వెస్ట్ సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అక్కడ టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది..పైగా అమరావతి ఉద్యమం ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడ గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పి..శైలజకు సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

అదే సమయంలో పెదకూరపాడు సీటు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి కొలికపూడి డిమాండ్‌ని టీడీపీ పట్టించుకుని శైలజకు సీటు ఇస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news