త్వరలోనే మునుగోడు ఉప ఎన్నిక – కోమటి రెడ్డి సంచలన ప్రకటన

-

త్వరలోనే మునుగోడు ఉప ఎన్నిక వస్తుందని సంచలన ప్రకటన చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాబోయే రోజుల్లో యుద్ధం ప్రకటిస్తానని.. ఇది పార్టీలకు సంబంధించిన యుద్ధం కాదు..కెసిఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు జరిగే చివరి యుద్ధమని పేర్కొన్నారు. ఇది ధర్మ యుద్ధం..మునుగోడు ప్రజలతో మాట్లాడతా..ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడే యుద్ధమని వెల్లడించారు.

ప్రజాస్వామ్య నెలకొనాలంటే మునుగోడు తీర్పు తెలంగాణ ప్రజల మార్పు అవుతుంది..అసెంబ్లీ సాక్షిగా ప్రతి సమస్య పై నేను మాట్లాడనని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే గజ్వేల్ సిరిసిల్ల, సిద్ధిపేట అన్న విధంగా చేశారు..నేను అమిత్షా ని కలిసిన తరువాత రాజీనామా అంశం చర్చించకపోయిన పార్టీ మరతా అని చెప్పకపోయినా మీ పేపర్ల లో బేరసారాలు కదా అని నిలదీశారు.

ఉపఎన్నిక కేసీఆర్ అనుకుంటే రాదు మునుగోడు ప్రజలనుకుంటే వస్తుంది..కెసిఆర్ ప్రభుత్వం దిగివచ్చి మునుగోడు అభివృద్ధి కి నిధులు వస్తాయి అనుకుంటే ఉప ఎన్నిక వస్తుందని తెలిపారు. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాలను మార్చివేస్తాయి.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..ఈ ఉపఎన్నిక యుద్ధం ద్వారా తెలంగాణ ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news