కాకరేపుతున్న కాంగ్రెస్ మీటింగ్.. రేవంత్ రెడ్డి సమావేశానికి కోమటిరెడ్డి డుమ్మా

-

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో.. మళ్లీ నాయకుల మధ్య అంతర్యుద్ధం మొదలైందది. మరికాసేపట్లోనే… నాగార్జున సాగర్ కు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రానున్నారు. అయితే… ఈ కాంగ్రెస్‌ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టారు. ఉత్తమ్ కుమార్‌ రెడ్డి మాత్రం హాజరుకానున్నారు. ఇవాళ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కార్యక్రమానికి తాను వెళుతున్నట్లు… సాగర్ పోవడం లేదని నిన్ననే ప్రకటించారు కోమటిరెడ్డి.

నల్గొండ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకుల విస్తృత సమావేశం నాగార్జున సాగర్ జరుగుతుంది.. ఉదయం 11.గంటల నుంచి సమావేశం జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జి శ్రీ మనిక్కమ్ ఠాగూర్ నేతృత్వం లో సమావేశం ఉంది. నల్గొండకు మాత్రం ఎవరు రావొద్దు అంటున్నారు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ చాలా బలంగా ఉందని.. బలంగా లేని ప్రాంతాలకు రేవంత్‌ రెడ్డి వెళ్లాలని సూచించారు. దీంతో… ఇవాళ భువనగిరి లో జగ్గారెడ్డి సమీక్ష కూడా రద్దు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news