కేసీఆర్‌ మాట్లాడేవన్నీ అబద్ధాలే : కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

-

నేడు టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరటి అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించన విషయం తెలిసిందే. అయితే సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ కేంద్రం ప్రభుత్వం, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా… సీఎం కేసీఆర్ చేసిన‌ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని ఆయ‌న‌ మండిపడ్డారు. కనీసం నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడడానికి అపాయింట్‌మెంట్‌ అడిగినా కేసీఆర్‌ ఇవ్వలేదని విమర్శించారు రాజగోపాల్‌రెడ్డి. కేసీఆర్‌ మాట్లాడేవన్నీ అబద్ధాలేన‌న్న రాజ‌గోపాల్ రెడ్డి.. మునుగోడు ఇచ్చే తీర్పుతో కేసీఆర్‌ దిగిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు రాజగోపాల్‌రెడ్డి. రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రతిపక్షం లేకుండా చేశారో అప్పుడే కేసీఆర్‌ పతనం మొదలైందని కోమ‌టిరెడ్డి అన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవం కోసమే ఉప ఎన్నిక వచ్చిందన్న మాజీ ఎమ్మెల్యే.. కేసీఆర్‌ అహంకారం వల్లే ఈ ఉప ఎన్నిక వ‌చ్చింద‌న్నారు రాజగోపాల్‌రెడ్డి. ఎమ్మెల్యేలకు అపాయింట్‌ ఇవ్వడం లేదంటే అది కేసీఆర్‌ అహంకారం కాదా అని ఆయ‌న‌ ప్రశ్నించారు. బీజేపీకి ఓటేస్తే మీటర్లు వస్తాయన్న కేసీఆర్‌ మాటలు అసత్యాలని ఆయ‌న‌ అన్నారు. బీజేపీకి ఓటేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు రావని స్పష్టం చేశారు రాజగోపాల్‌రెడ్డి. కేసీఆర్‌ తన ప్రాభవం కోసం ఎప్పటికప్పుడు బీజేపీపై నిందలు మోపుతున్నారని కోమ‌టిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాజగోపాల్‌రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version