చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును పవన్ కళ్యాన్ చదువుతున్నారు: మంత్రి రోజా

-

చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును పవన్ కళ్యాణ్ చదువుతున్నారని… విమర్శించారు మంత్రి రోజా. కోనసీమ అల్లర్లు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. చంద్రబాబు ప్యాకెజీ కోసం మాట్లాడకండి అంటూ హితవు పలికారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తుని సంఘటన మేమే చేయించాం అని విమర్శిస్తున్నారు.. ఆ సయమంలో అధికారం ఉన్న టీడీపీ ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. మీరు అసలు ఆలోచించి మాట్లాడుతున్నారా..? లేక చంద్రబాబు స్ట్రిప్టు చదువుతున్నారా..? అని ప్రశ్నించారు రోజా. కోనసీమ కోసం ఆత్మహత్యకు పాల్పడుతా అన్న వ్యక్తి జనసేన కార్యకర్తే అని రోజా ఆరోపించారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని గతంలో చంద్రబాబు అన్నారని… ఈ రోజు ఎందుకు వ్యతిరేఖిస్తున్నారో తెలుస్తోందని… డబుల్ స్టాండడ్ గా వ్యవహిస్తున్నారని విమర్శిస్తున్నారు. అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయని.. ఇప్పుడు విమర్శిస్తున్నారని అన్నారు. ఈ ఘటన వెనక ఉన్నవారిని, తప్పు చేసిన వారిని వదిలేది లేదని రోజా హెచ్చరించారు. ప్రధాన నిందితుడు అన్యం సాయి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తో దిగిన ఫోటోలే అందుకు నిదర్శనం అని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news