రాజగోపాల్ రెడ్డి లాగా రసమయి కూడా రాజీనామా చేయాలి – కొండా విశ్వేశ్వర్ రెడ్డి

-

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లాగా దమ్ము ఉంటే తన రసమయి బాలకిషన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని చెరువు కట్ట సమీపంలో ప్రజా గోస బిజెపి భరోసా బైక్ ర్యాలీ ప్రారంబించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్టంలో తండ్రి కొడుకుల అరాచక పాలన కొనసాగుతుందని.. సీఎం కేసీఆర్ మాటలు విని కరీంనగర్ జిల్లా అభివృద్ధి అయింది అనుకున్నానని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్టంలో ఎం చేసిండో ప్రజలకు చెప్పలేక వేరే రాష్టలలో పర్యటనలు చేస్తున్నాడని.. రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన రసమయి బాలకిషన్ నియోజకవర్గంలో ఎం అభివృద్ధి చేయలేదని ఆగ్రహించారు. దమ్ముంటే ఎమ్మెల్యే రసమయి రాజీనామా చేసి ఉప ఎన్నిక ధ్వారా మానకొండూర్ నియోజకవర్గన్ని అభివృద్ధి చేయాలి… అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కు కూడా సీఎం కేసీఆర్ నిధులు ఇవ్వడం లేదా అని నిలదీశారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news