PK కంటే కేసీఆరే పెద్ద వ్యూహకర్త : మంత్రి కేటీఆర్

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. PK కంటే కేసీఆరే పెద్ద వ్యూహకర్త అని తెలిపారు మంత్రి కేటీఆర్. సిఎం కేసీఆర్ ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో ఉన్నారు.. వచ్చే ప్లీనరీలో జాతీయ రాజకీయాలపై తీర్మానం చేస్తామని ప్రకటన చేసారు.

కేసీఆర్‌తో జాతీయ నేతలు కలిసిరావడం లేదనేది అవాస్తవం.. కాంగ్రెస్ పార్టీతోనే ఫ్రంట్ ఉండాలన్న ఏకాభిప్రాయం లేదని ఓ ప్రముఖ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కేటీఆర్ ఈ విషయాలు తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ఆకాశం నుంచి ఏదో తీసుకొస్తారని కాదు.. మారుతున్న ట్రెండ్ ప్రకారం ఆయన వ్యూహాలను ఉపయోగించుకుంటున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రశాంత్‌ కిషోర్‌ను మించిన వ్యూహకర్త అని.. మోదీ, ఈడీలకు మేం భయపడమని స్పష్టం చేశారు కేటీఆర్.

కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు పదేళ్ల వయసు ఉన్న బాలుడు రెండు సంవత్సరాల్లో ఓటర్ కాబోతున్నాడు. ఆ బాలుడికి కేసీఆర్ ఉద్యమ నాయకుడుగా కాకుండా ముఖ్యమంత్రి గా మాత్రమే తెలుసు. జనరేషన్ మారేకొద్దీ కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా రాజకీయాల్లో మార్పులు రావాలన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version