మహిళలంటే గౌరవం ఉంటే.. రేపిస్టులను ఎలా విడుదల చేస్తారు : కేటీఆర్

-

మోదీ ప్రభుత్వానికి మహిళలపై గౌరవం లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గుజరాత్‌లో 11 మంది రేపిస్టులను విడుదల చేయడాన్ని చూస్తేనే ఈ విషయం అర్థమవుతోందని మండిపడ్డారు. మోదీ సర్కార్ జోక్యం చేసుకుని ఆ రేపిస్టులను విడుదల చేయకుండా.. కఠిన శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అక్కడి సర్కారు రెమిషన్‌ ఆర్డర్‌ను రద్దు చేయాలని ట్వీట్ చేశారు. ఎంహెచ్‌ఏ ఆర్డర్‌కు వ్యతిరేక చర్యలు అసహ్యంగా ఉంటాయన్న కేటీఆర్‌.. దేశం పట్ల ప్రధానికున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పేర్కొన్నారు.

తరచూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మోదీ సర్కార్‌పై ట్వీట్ వార్ చేస్తూనే ఉంటారు. ఈ మధ్య అది మరింత ఎక్కువైంది. ఇప్పటికే పెరుగుతున్న పెట్రో, నిత్యావసర ధరలు, ఈడీ సోదాలు, ఐటీ రైడ్స్, భాజపా నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీఆర్ తన ట్వీట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తాజాగా యూపీలో రేపిస్టులను విడుదల చేయడంపై మంత్రి గళమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news