జగన్ కు సిగ్గుందా..? నిన్ను దేనితో కొట్టమంటావ్‌ : కూన రవి

-

జగన్ కు సిగ్గుందా..? నిన్ను దేనితో కొట్టమంటావ్‌ అని సంచలన వ్యాఖ్యలు చేశారు టిడిపి నేత కూన రవికుమార్. జగన్ సీఎం అయ్యాక శ్రీకాకుళం జిల్లాకు మూడుసార్లు వచ్చారు… తీతిలీ పరిహారం ఇవ్వటానికి 3 ఏళ్ళు పట్టిందని ఆగ్రహించారు. అబద్దాలు చెప్పటంలో జగన్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సరిపోదని.. జగన్ రెడ్డి కాదు జగన్ మోసపు రెడ్డి అని ఫైర్‌ అయ్యారు.

నాన్న బుడ్డి పై 100 రూపాయలు నొక్కితే తప్పా అమ్మఒడి ఇవ్వలేని పరిస్థితి అని.. ఎంతోమంది మహిళల తాళి బొట్లు తెంపేస్తున్నాడని ఆగ్రహించారు. జగన్ చెప్పే అబద్దాలు ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నాడని.. జగన్ కు సిగ్గుందా..? మ్యానిఫెస్టో అమలు చేయని నాయకుణ్ణి చెప్పుతో కొట్టమన్నావని నిప్పులు చెరిగారు.

ఏపీ ప్రజలు నిన్ను దేనితో కొట్టాలో చెప్పు అని ప్రశ్నించారు. 13000 ఇచ్చి చిన్నారులతో 15000 ఇచ్చినట్టు అబద్దాలు చెప్పిస్తున్నాడు… జగన్ పిల్లలకు కంస మామ అని ఫైర్‌ అయ్యారు. జగన్ మామను చూసి బడి పిల్లలు ఏమి నేర్చుకోవాలి? బాబాయిని హత్య ఎలా చేయాలనా? అవినీతి ఎలా చేయాలనా? అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news