రైతులకు అలర్ట్‌.. నేడే చివరి తేదీ..

-

ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద 12వ విడత నిధులు త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే, ఈ నిధులు విడుదల కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీ చేయడం తప్పనిసరి చేసింది. ఈ-కేవైసీ ఫైలింగ్‌ గడువును ఇప్పటికే చాలా సార్లు పొడిగించిన కేంద్రం.. ఈసారి పెంచే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. కాగా, పీఎం కిసాన్ పథకానికి ఈ కేవైసీ ఫైల్ చేయడానికి గడువు నేటితో ముగియనుంది. ఈ గడువు లోగా ఈ కేవైసీ పూర్తి చేస్తేనే 12వ విడుత నిధులు రైతుల ఖాతాల్లో పడనున్నాయి. పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ నమోదిత రైతులకు ఈ కేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ పీఎంకిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది.

PM Kisan Scheme: अक्टूबर में आ सकते हैं 2000 रुपए, तुरन्त करा लें रजिस्ट्रेशन, घर बैठे ही मिलेगा फायदा | Zee Business Hindi

లేదంటే బయోమెట్రిక్ ద్వారా ఈ-కేవైసీ నమోదు చేయడం కోసం రైతులు సమీపంలోని సీఎస్‌సీ కేంద్రాలను సంప్రదించాల్సి ఉంటుంది. ఎవరైతే పీఎం కిసాన్ యోజన పథకానికి అర్హులై ఉండి, ఇప్పటికీ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వారు గడువు పూర్తయ్యేలోగా అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అంతకుముందు, గడువు మే 31, 2022 కాగా ప్రభుత్వం దానిని జులై 31కి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. అంతే కాకుండా ఓటీపీ ప్రమాణీకరణ ద్వారా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని కూడా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news