కోడి కత్తి కమల్ హాసన్ కొత్త నాటకాలు – జగన్ పై చంద్రబాబు సెటైర్లు

-

కోడి కత్తి కమల్ హాసన్ కొత్త నాటకాలు ఆడుతున్నాడని ఏపీ సీఎం జగన్ పై చంద్రబాబు సెటైర్లు వేశారు. వరద బాధితులకు కూరగాయలు, బియ్యం, ఎండు గడ్డి వితరణ చేయండి… ఇటీవల కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయని తెలిపారు. దశాబ్దాల తరబడి సమకూర్చుకున్న సంపదంతా వరదపాలై కట్టుబట్టలతో ప్రజలు నిస్సహాయ స్థితిలో వున్నారని.. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసింది.. మానవత్వాన్ని మరచిందని ఆగ్రహించారు.

మేత లేక పశువులు నకనకలాడుతున్నాయి… కూరగాయలు, బియ్యం లేక ప్రజలు, పసి బిడ్డలు దుర్భర స్థితిలో వున్నారని పేర్కొన్నారు. ఇళ్లల్లోకి పూర్తిగా నీరు చేరి 4 నుంచి 7 రోజులు నిల్వ ఉండిపోయాయి. ఇళ్లలో బురద చేరిపోయిందని.. ఫ్యాన్లు, టీవీలతోపాటు ఇంటిలో వున్న అన్ని వస్తువులు పనికి రాకుండా పోయిన దృశ్యాలు నా పర్యటనలో చూశానని చెప్పారు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం బాధ్యత మరిచిందని.. అలాంటప్పుడు బాధితుల్ని సమాజం, మానవతావాదులు, దాతలు ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ఎన్‌ఆర్‌ఐలు కూడా ఎండుగడ్డి, కూరగాయలు, బియ్యం వితరణ చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news