క్షీణించిన లతా మంగేష్కర్ ఆరోగ్యం..మరో హెల్త్‌ బులిటెన్‌ విడుదల

-

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ జనవరి 8 వ తేదీన కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్‌ రావడంతో… సరిగ్గా 20 రోజుల కిందట ఆమెను ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆస్పత్రిలో ఆమె కుటుంబ సభ్యులు చేర్పించారు. అప్పటి నుంచి లతా మంగేష్కర్‌ కు.. ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మొదట ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందంటూ ఆమె కుటుంబ సభ్యులు చెబుతూ వస్తున్నారు.

ఇది ఇలా ఉండగా తాజాగా ముంబై బ్రీచ్‌ కాండీ ఆస్పత్రి వైద్యలు గాయని లతా మంగేష్కర్‌ హెల్త్‌ బులిటెన్ ను విడుదల చేశారు.”గాయని లతా మంగేష్కర్ ICUలో ఉన్నారు మరియు తమ పర్యవేక్షణలో ఉన్నారు. గత 29 రోజులుగా గాయని లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె పరిస్థితి ఇంకా క్షిణించింది ” అంటూ ముంబై బ్రీచ్ కాండీ హాస్పిటల్‌ డాక్టర్ ప్రతీత్ సమదానీ తెలిపారు. ఇక బ్రీచ్‌ కాండీ ఆస్పత్రి వైద్యలు తాజాగా ప్రకటించిన హెల్త్‌ బులిటెన్‌ తో లతా మంగేష్కర్‌ అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news